Thursday, July 25, 2013

సాయంత్రం పూట ఈ కట్టపైకి చాలా మంది వస్తుంటారు.

గోదావరి కి స్నానాల రేవు దగ్గరనుంచి ఇవతల పార్క్ దాకా వున్న కరకట్ట కి ప్రక్క వైపు రామాయణం లోని ముఖ్య సన్నివేశాల్ని బొమ్మల రూపం లో మలిచారు.ఇది కాస్త పొడవుగా వుండటం వల్ల ఆ పచ్చిక బయళ్ళలో కొంత మంది యాత్రికులు కూర్చుంటుంటారు.శ్రీరామ జననం దగ్గరనుంచి పట్టాభిషేకం వరకు ఘట్టాలు ఇక్కడ శిల్పాలు వున్నాయి.ఇవి బాపు-రమణల ఆధ్వర్యంలో రూపుదిద్దుకున్నాయి చాన్నాళ్ళకిందట..!

సాయంత్రం పూట ఈ కట్టపైకి చాలా మంది వస్తుంటారు.అవతల వేపు గోదావరి చక్కగా అందంగా కనిపిస్తుంది.చల్లటి గాలి కూడా తగులుతుంది. వాకింగ్ కి కూడా జనాలు వస్తుంటారు.గోదావరి వరద ని ఇక్కడ నుంచి హాయిగా చూడవచ్చు. Click Here



No comments:

Post a Comment

Thanks for your visit and comment.