Pages

Saturday, February 22, 2014

వీడ్కోలు సమావేశం



నందిగామపాడు గ్రామంలోని జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాల లోని తొమ్మిదవ తరగతి చదువుతున్న విద్యార్థులు,ప్రస్తుతం పదవ తరగతి చదువుతూ త్వరలో పబ్లిక్ పరీక్షలు రాయనున్న విద్యార్థులందరికీ వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. నిన్న శుక్రవారం(21-2-2014) నాడు ఆద్యంతం ఆహ్లాదకరంగా జరిగింది.



పాఠ్యపుస్తకాల్లోని అంశాలతో పాటు వ్యక్తిగత క్రమశిక్షణ ప్రతి విద్యార్థికి ఎంతో అవసరమని ప్రధానోపాధ్యాయులు శ్రి.వి.కాళేశ్వర రావు అన్నారు.10 వ తరగతి చదువుతున్న విద్యార్థులు రేచల్ జాయ్,ఐ.రజిత,ఐ.గాయత్రి,డి.దివ్య,చారి తదితరులు తమ చదువుకి సంబందించిన అనుభవాలు తెలియజేశారు. అదేవిధంగా తొమ్మిదవ తరగతి చదివే సౌమ్య,సంధ్య,సాయి సంకీర్తి తదితరులు మాట్లాడుతూ 10 వ తరగతి విద్యార్థులంతా మంచి గ్రేడ్లు తెచ్చుకోవాలని ఆకాంక్షించారు.



సాయిసంకీర్తి గీతాలాపన చేసిన పిమ్మట ఉపాధ్యాయ సిబ్బంది శ్రీయుతులు కె.ఆదినారాయణ,ప్రసాద్,శ్రీనివాస్,ఎన్.మధుసూదన్ రావు,జి.లక్ష్మణ్ కె.తులసి,రమాదేవి,సుబ్రమణ్యేశ్వరి తదితరులు శుభాకాంక్షలందించారు.

తొమ్మిదవ తరగతి విద్యార్థులు సరస్వతీ దేవి చిత్రపటాన్ని పాఠశాలకి ఈ సంధర్భంగా బహూకరించారు.అదేవిధంగా సమావేశం లో ఫాల్గొన్న అందరికీ పెన్నులను కూడా బహూకరించారు.మిఠాయిల పంపిణీ తరవాత సౌమ్య వందన సమర్పణ తో కార్యక్రమం ముగిసింది.


No comments:

Post a Comment

Thanks for your visit and comment.