శ్రీమతి రాళ్ళబండి ఉమాదేవి గారి పదవీ విరమణ సందర్భంగా జరిగిన అభినందన సభ విద్యార్థుల,ఉపాధ్యాయుల,శ్రేయోభిలాషుల నడుమ కోలాహలంగా జరిగింది.రాష్ట్ర సాంస్కృతిక శాఖ డైరక్టర్ మరియు ఉమారాణి గారి సోదరులు అయిన డా.రాళ్ళబండి కవితాప్రసాద్ ముఖ్య అథితిగా ఫాల్గొన్నారు.ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు రమాదేవి ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు.శ్రీమతి ఉమాదేవి మరియు వారి భర్త రామకృష్ణం రాజు గారిని వారి శ్రేయోభిలాషులు,మిత్రులు,విధ్యార్థులు ఘనంగా సన్మానించారు.
తెలుగు భాష లో ఉద్ధండులైన ఒక తరం వారు పదవీ విరమణ చేస్తుండగా ..మళ్ళీ ఇప్పుడొస్తున్న తెలుగు పండితులు అంతటి పాండిత్యం వున్నవారా అని ప్రశ్నించుకుంటే నిరాశే మిగులుతోందని శ్రీ కవితాప్రసాద్ అన్నారు.భద్రాచలం తో తనకు గల అనుబంధాన్ని ఈ సందర్భంగా గుర్తుకు తెచ్చుకున్నారు.తెలుగు,సంస్కృతం,గ్ర్రీక్ భాషలకు మాత్రమే గల వైశిష్ట్యాన్ని వివరించారు.
డా.జయరామి రెడ్డి,మురళీధర రావు,ఏ.వి.రావు,తులసీ దాస్,గోపి,వాణీదేవి,బాలాజీ రాజు,ఇంకా ఇతరులు ప్రసంగించారు.ఈ కార్యక్రమం తరువాత విందుభోజనంతో సమావేశం ముగిసింది.