Wednesday, June 26, 2013

మధుర గాయకుడు చలం పాటల సి.డి. ఆవిష్కరణ!



భద్రాచలంలోని రెడ్ క్రాస్ భవనం లో ఇటీవల విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు,జగమెరిగిన అభ్యుదయ గాయకుడు శ్రీ చలం యొక్క పాటల సి.డి ని ఆవిష్కరించడం జరిగింది.భద్రాచలం డివిజన్ లోని చర్ల గ్రామానికి చెందిన చలం తన స్వరాలాపన ద్వారా ఎల్లరకు చిరపరిచితులే! మొత్తం ఆరు గీతాలు ఈ సి.డి. లో ఉన్నాయి.వారి కుమారుడు శశాంక్  కూడా దీనిలో ఓ పాటని పాడారు.

శ్రీయుతులు మాగంటి సూర్యం (లిటిల్ ఫ్లవర్స్ సంస్థల అధినేత),సాహితీ స్రవంతి రాష్ట్ర బాద్యులు ఆనందాచారి,ప్రసిద్ద కవి మాల్యశ్రీ,యు.టి.ఎఫ్. జిల్లా బాద్యులు గోపాల కృష్ణ,స్థానిక కాంగ్రెస్ నాయకులు తాండ్ర నరసిం హా రావు, రచయిత వెంట్రపల్లి సత్యనారాయణ ఇంకా తదితరులు ఈ కార్యక్రమంలో ఫాల్గొన్నారు.  

No comments:

Post a Comment

Thanks for your visit and comment.