Showing posts with label My Writings. Show all posts
Showing posts with label My Writings. Show all posts

Saturday, April 12, 2014

మనవాళ్ళు ఇంగ్లీష్ లోనుంచి అనువాదం చేసుకోవడంలో చూపించినంత ఉత్సాహం తెలుగు రచనల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయడంలో ఎందుకు చూపించరు..!

మనవాళ్ళు ఇంగ్లీష్ లోనుంచి అనువాదం చేసుకోవడంలో చూపించినంత ఉత్సాహం తెలుగు రచనల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయడంలో ఎందుకు చూపించరు..!అనువాదం వల్లనే మన వాతావరణం లోని మనకే సొంతమైన కొన్ని అంశాలు ఇతర భాషలవాళ్ళకి బాగా చేరే అవకాశం ఉన్నది.ఎప్పుడో తప్ప పెద్దగా తెలుగు లోని వివిధ సాహిత్య ప్రక్రియలు ఇతర భాషల్లోకి ,ముఖ్యంగా ఆంగ్ల భాష లోకి వెళుతున్నట్లు కనిపించడంలేదు.

ఇంగ్లీష్ లోకి సీరియెస్ గా అనువాదం చేసేవాళ్ళు బహుతక్కువ.ముక్కలు ముక్కలుగా,పేరాగ్రాఫ్ లుగా ఇంగ్లీష్ లో రాసేవాళ్ళని చూసినపుడు అనిపిస్తుంది..వీళ్ళెందుకని ఇంతకంటే ఎక్కువ పరిధి ఉన్న ఆంగ్ల అనువాద ప్రక్రియలోకి రాకూడదూ అని.ఎందుకనో తెలుగు వాళ్ళలో ,ఇంగ్లీష్ బాగా వస్తుందని అనుకునేవాళ్ళ లో కూడా  ఒక తెలుగు కధనో,నవలనో అనువాదం చేయాలంటే బెరుకుగా ఫీలవుతారు.

చాలామంది ఇంగ్లీష్ ప్రొఫెసర్లు,లెక్చరర్లు  కూడా ఇందుకు మినహాయింపు కాదు.తెలుగువాడి ఆంగ్లప్రకటనా సామర్ధ్యం పై సాటి తెలుగువాడికే చాలా సందేహం.అందుకనేనేమో తెలుగువాళ్ళు ఒక ఇంగ్లీష్ పత్రిక పెట్టినా లేదా ఏ ఆత్మకధ లాంటిది రాసుకున్నా పక్కన బాసటగా ఏ తమిళునిదో,బెంగాలీదో,కనీసం ఏ మిశ్రా,చావ్లా లాంటి పేర్లు దానికి సపోర్ట్ గా ఉండవలసిందే.అప్పుడుగాని శంఖులో తీర్థం పోసినట్లుగా ఆ ఆంగ్లరచనని మనం ఆమోదిస్తాం.

తెలుగు వాడికి నగర సంస్కృతి లేకపోవడమే దానికి కారణం అని కొందరంటారు. నాకైతే అనిపిస్తుంది ఇంగ్లీష్ ఫిక్షన్ ని ,నాన్ ఫిక్షన్ ని చదివే  సంస్కృతి ని మనలో పెంపొందింపజేసుకోకపోవడమే అసలు కారణం..! EAMCET,IIT  లాంటి వాటిని దృష్టిలో పెట్టుకొని లక్షలు పోసి ఇంటర్మీడియెట్ బట్టీ చదువులు చదివిస్తాం..కాని ఇంగ్లీష్ లోని మంచి పుస్తకలని చదవడం లో అభిరుచిని గాని, పట్టుమని పది వాక్యాలని రాసే అభినివేశాన్ని గాని ఈ సో కాల్డ్ కార్పోరేట్  కాలేజీలు ఇవ్వవు.

మనం తెలుగు పుస్తకాల్ని ఎలా చదువుతామో ,అలాగే ఇంగ్లీష్ పుస్తకాల్ని కనీసం సమకాలీనమైనవాటిని చదివే ఒక సంస్కృతి ప్రతి చదువరిలోనూ రావాలి.తెలుగుని ప్రేమించడం అంటే ఇంగ్లీష్ ని ద్వేషించడం ,తిట్టడం అనే హిపోక్రసీ లో  జీవిస్తున్న వాళ్ళని నిర్లక్ష్యం చేస్తేనే ఇది సాధ్యం.

మనకి మించిన నగర సంస్కృతి కేరళలో మాత్రం ఏముంది.నగర సంస్కృతి అంటే కేవలం material luxuries అనే కోణం లోనే తీసుకోరాదు. అది మానసిక తలాల్లో జరిగే ఒక ముందు చూపుగా కూడా పరిగణించాలి.మీరు కేరళ వెళ్ళండి..మన మండల కేంద్రాల్లో కనిపించే కొన్ని ఖరీదైన బిల్డింగులు కూడా అక్కడి జిల్లా కేంద్రాల్లో కనిపించవు. అయితే ఒక చిన్న పెంకుటింటిలో ,పైన ఏ ఆచ్చాదన లేకుండా లుంగీ లో ఉండే ఒక మామూలు వ్యక్తి కూడా వైక్కం బషీర్ ని చదివినట్టే సిడ్నీ షెల్డన్ నీ చదువుతాడు.Alexia De Vere  పాత్రని ప్రస్తుత మహిళా రాజకీయవేత్తలతో పోల్చిచెప్పగలడు.అది ఎలా వచ్చింది...తమ మాతృ భాషలానే ఆంగ్ల రచనల్ని చదివే ఒక సంస్కృతి లోనుంచి..!

అనువాదం లక్ష్యం ఏమిటి..?ఒక ప్రాంత నేపధ్యాన్ని ఇంకొకరికి పరిచయం చేయడం.నూటికి నూరు శాతం "ఒరిజినల్ రచన" కి దగ్గరగా లేదని విమర్శించడం కూడా కూడని పని.అనువాదం చదివే పాఠకుడు ఒరిజినల్ నుంచి అనువాదం లోకి వచ్చే Gap ని అర్ధం చేసుకోగలడు.మరీ నలగని వాటిని  ఫుట్ నోట్స్ ని ఇచ్చి చాలా మేరకు  help చేయవచ్చు. ఓ మితృడు ఈ మధ్యన అన్నాడు...కొన్ని తెలుగు పదాల్ని ఇంగ్లీష్ లోకి అనువాదం చేయడం కష్టం అని.అవును మక్కీకి మక్కీగా ఇతర భాషలో పదాలు ఉండకపోవచ్చు.కాని మన భాషలోని పదాన్ని అలాగే ఉంచి దాని నేపధ్యాన్ని వివరిస్తే అర్ధం కాకపోవడమనేది ఉండదు.పైగా పఠితకి అది థ్రిల్ల్లింగ్ గా ఉంటుంది.

ఉదాహరణకి "ఒమెర్త"  అనే పేరుతో మేరియో ప్యూజో ఒక నవలరాశాడు.అది ఇటాలియన్ పదం.ఇంకా చెప్పాలంటే సిసిలీ పరిసరాల్లో మాఫియా అవసరాల్లో భాగంగా పుట్టిన పదం. ఆ నవల రాసేటప్పుడు దానికి సమానమైన ఆంగ్ల పదం లేదు. కాబట్టి దాని నేపధ్యం గూర్చి ముందర పేజీల్లోనే వివరణ ఇస్తాడు రచయిత.CODE OF SILENCE అని.ఎటువంటి పరిస్తితుల్లో కూడా తనకి గాని,తన కుటుంబ సభ్యులకు గాని హాని జరిగినా పోలీసులకి ఆ వ్యక్తి గురించిన వివరాలు ఇవ్వకుండా  ఉండటం దానిలో ఓ భాగం.అవసరమైతే నిష్కారణంగా జైలుకి వెళ్తారు తప్ప వెల్లడించరు.ఆ "ఒమెర్త"  ని అధిగమించినవాళ్ళు Family చేతిలో Death punishmint ని అనుభవించవలసిందే.ఇక్కడ Family అంటే కుటుంబం అని కాదు నేర సామ్రాజ్యం అని అర్ధం మాఫియా పరిభాషలో. మరి ఇవన్నీ ఎలా తెలిశాయి....దానికి తగిన వర్ణనలు,వివరాలు అదనంగా ఇవ్వబట్టే కదా..!ఈ రోజున ఒమెర్త అనే పదం ఇంగ్లీష్ భాషలో కలిసిపోయింది ఆ నవల పుణ్యాన.

ఇది తెలుగు కీ వర్తిస్తుంది. Click here

                                             -----------KVVS MURTHY

Thursday, March 20, 2014

కుష్వంత్ సింగ్ ఈ రోజేపోవడమేమిటబ్బా..!



ఈరోజు పొద్దున దాసరి అమరేంద్ర గారి పుస్తకం లో కుష్వంత్ సింగ్ ఇంటర్వ్యూ చదివాను.చదివిన తరువాత అనుకున్నా ఈ పెద్దమనిషి ఇంకా ఆరోగ్యంగా బాగానే ఉన్నాడే..కాకపోతే ఇదివరకటిలా ఎక్కువగా సంచలనం సృష్టించే మాటలేవి అనడంలా..అందుకనే పెద్దగా న్యూస్ ఏమీ రావడం లేదని.అదేమిటో ఈరోజు పొద్దు పోయినతరవాత నెట్ ఓపెన్ చేస్తే ఈయన మరణవార్త.

ఆయనది మొదటినుంచి కూడ పెడసరం దారే..! ఏది అనుకుంటే అది ఎవరిమీద పడితే వాళ్ళమీద కామెంట్ చేసి పారేస్తాడు. ఆయన రచనల్లో The history of Sikhs గ్రంధమొక్కటే కాలపరీక్షకి నిలుస్తుందని అంటాడు.దాన్ని మళ్ళీ సవరించి రాయాలసిన అవసరముందని కూడ గత ఏడాది ఏదో ఇంటర్వ్యూ లో చెప్పినట్లు గుర్తు.

అటు సీరియస్ సాహిత్యం,ఇటు కాలక్షేప రచనలు చేసిన సవ్యసాచి అనిచెప్పాలి.తనకు మహిళలు,మద్యం అంటే ప్రీతి అని బాహాటంగా చెప్పుకోవడం అతనికే చెల్లింది.కుష్వంత్ ని ఎంతమంది ఇష్టపడతారో అంతకంటే ఎక్కుమంది ద్వేషిస్తారు కూడ.

ఒకానొక సమయం లో ఓషో ని కూడ అనుసరించినట్లు గుర్తు.కుష్వంత్ ఇష్టపడే వ్యక్తులలో ఆయన ఒకరు.భారత ప్రభుత్వం తరపున ప్రెస్ విభాగానికి సంబందించి కెనడా లో మొదటిగా పనిచేసిన అతను ఆతరవాత ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా కి ఎడిటర్ గా పనిచేశారు.ఇంగ్లీష్ లో జర్నలిస్ట్ గా అదీ కాలమిస్ట్ గా సక్సెస్ అయినవారికి దేశ వ్యాప్తంగా పేరు, డబ్బు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది.ఎందుకంటే ప్రముఖమైన ప్రాంతీయ భాషల్లోని పత్రికలు వారి ఆంగ్లరాతలని డబ్బింగ్ చేసుకుని ప్రచురించుకుంటాయి.మంచి పారితోషికమూ ఇస్తాయి.విదేశీ పత్రికలు ఇక సరే సరి.అలాంటి కొద్దిమంది అదృష్టవంతుల్లో కుష్వంత్ సింగ్ ఒకరు.

    

Wednesday, February 19, 2014

Telangana and Bhadrachalam blues



By voice vote in the Lok sabha,Telangana state has been materialized yesterday.It's an historical success for Telangana region.As a result of long lasting struggle and sacrifices Telangana flowered out despite of many an obstacles on the way.

Our Bhadrachalam division is of a different story when compared to the rest of other places.Bhadrachalam division is most debated in the saga of separation process,after Hyderabad.Because of the forth coming Polavaram project the place has a strategic importance.Not only that,it has boarders with Both Odisha and Chattisgarh states as well.

As per sources almost 123 villages,said to be Polavaram project hit-prone areas in the division,have been included in Seemandhra now.Even some villages of Bhadrachalam mandal also deleted by the effect.Bhadrachalam revenue division has four mandals on its north side and three mandals south side.At present,most of the villages belonged to southern mandals are merged with Andhra region.

Chintoor,Kunavaram and V.R.Puram mandals have lost majority of the villages under Polavaram project effect.Chintoor mandal head quarter now prevailed in Andhra and some of its villages hardly away 3 k.m. are in Telangana.In some instances,houses are considered to be in the Andhra and their agricultural lands fall in to Telaangana.See,how things paralyzed at a stroke of prevailing circumstances.

Frankly speaking,in these areas,except Adivasis and other some people,most of the population had been migrated from several other districts long back.Coping with newly situation may be a bit easier  for the latter.But in case of the tribal population,it could take some time to confront the ground level realities.They are bound to learn new skills in order to struggle for existence.

The greater solace is Bhadrachalam town,its surroundings and northern mandals are remained as part and parcel of the division as before.It could be more comfortable to the people ,in case,the pilgrim town  turned out to be a district head quarter in future.

New states.New things.New experience for Telugu people now.Let us wish both states to be flourished and touch new heights in all walks of life.Wherever we are,there is some bonding spirit all the way..!That is Telugu..!!
                       --Written by KVVS Murthy