Tuesday, July 23, 2013

ఇప్పుడేముంది గాని 1986 లో వచ్చిన గోదారి లోనైతే గేదెలు,గొర్రెలు,ఇళ్ళు,మంచాలు,శవాలు ఇలా సమస్త రకాలు కొట్టుకొచ్చాయి.

ఈ ఏడాది గోదావరి వుగ్ర స్వరూపం దాల్చింది.భద్రాచలం లోని చాలా ఏరియాలు లోతట్టుగా వున్నవి మునిగి బాగానే దెబ్బ తిన్నాయి.గుడి ముందు వున్న ఇళ్ళు,షాపులు వరద తాకిడి కి గురయ్యాయి.ఇంకా కొన్ని కాలనీలు వరదలో మునిగాయి.చుట్టు ప్రక్కల మండలాల సంగతి చెప్పనే అవసరం లేదు.కూనవరం,చింతూరు,వి,ఆర్.పురం,దుమ్ముగూడెం,చర్ల,వెంకటాపురం,వాజేడు మండలాల్లోని పంట పొలాలు దెబ్బతిన్నాయి.పై నుంచి కూడా బాగా వర్షాలు కదా.ఆ నీరంతా ఏమవుతుంది మరి.

ఈ కింద రెండు ఫోటోలు ఇచ్చాను. గోదారి ఒడ్డునున్నశ్మశాన వాటిక లోకి  కూడా వరద వచ్చి సమాధులు ..ఆ పైన తులసి కోటలు కూడా మునిగి వున్నయి.అయితే ఈ రోజు నుంచి కొద్దిగా వరద తగ్గు ముఖం పట్టింది.తగ్గడం అంటూ ప్రారంభిస్తే తీయడం ఎంత సేపు..!

పనిలో పనిగా కొంత మంది గోదారి వరదలో కొట్టుకొచ్చే దుంగలని..పుల్లల్ని తీసి వొడ్డున పెట్టుకొంటారు.వంట చెరుకుగా పనికొస్తుంది.పెద్దవైతే దేనికైనా పనికొస్తాయి..!ఇప్పుడేముంది గాని 1986 లో వచ్చిన గోదారి లోనైతే గేదెలు,గొర్రెలు,ఇళ్ళు,మంచాలు,శవాలు ఇలా సమస్త రకాలు కొట్టుకొచ్చాయి.  Click here




No comments:

Post a Comment

Thanks for your visit and comment.