Saturday, July 20, 2013

ఇది దక్షిణ భారత దేశంలోనే ఒక రికార్డ్ అట..!

ఈ రోజు ఉగ్ర గోదావరి ఫోటోలు కొన్ని తీసి ఇక్కడ పెట్టాను.మామూలు సమయాల్లో ఎంత ప్రశాంతంగా ఉంటుందో వరదలు పరిధులు దాటినప్పుడు గోదావరి అంత భయానకంగా వుంటుంది.ఇక్కడ నేను పెట్టినవి ఈ మధ్యాహ్నం 3 గంటల సమయం లో తీసినవి.స్నానాల రేవు దగ్గర తీసినవి.రమారమి 54 అడుగుల దగ్గర నిలిచివున్నది.భద్రాచలం డివిజన్ లోని చాలా ఇతర మండలాలు ఈ వరదల వల్ల దెబ్బతిన్నాయి.రహదారులు కూడా మూసుకు పోయాయి.లోతట్టు ప్రాంతాలు ఈ సారి బాగానే దెబ్బతిన్నాయి.నాకు తెలిసీ ఈ పదిహేనేళ్ళలో ఇంత పెద్ద స్థాయిలో వరదలు రాలేదు.

డివిజన్ లోని పేరూరు దగ్గర నిన్న ఒక్కరోజే 58 సె.మీ. వాన కురిసిందని చెప్పారు టి.వి.ల్లో..! ఇది దక్షిణ భారత దేశంలోనే ఒక రికార్డ్ అట..! 

వరద దృశ్యాలు చూడడానికి కరకట్ట మీదకి చాలా మంది జనాలు వస్తున్నారు.దూరం నుంచి యాత్రికులు అనుకుంటాం గాని ...కాదు..వరదని వీక్షించడానికి వచ్చినవాళ్ళే..!  





3 comments:

  1. వరద గోదావరి ఫొటోలు బాగున్నాయి.

    ReplyDelete
  2. వర్మగారు.. ధన్యవాదాలు...!

    ReplyDelete
  3. వర్మగారు.. ధన్యవాదాలు...!

    ReplyDelete

Thanks for your visit and comment.