Saturday, July 6, 2013

ఆ మధ్య స్నానాల రేవు వేపు వెళ్ళినప్పుడు ఈ ఫోటోని తీశాను

ఆ మధ్య స్నానాల రేవు వేపు వెళ్ళినప్పుడు ఈ ఫోటోని తీశాను.భద్రాద్రి వచ్చిన భక్తులు ఈ గోదావరి రేవు లోనే స్నానాలు చేసి దర్శనం చేసుకుంటారు.ఎండాకాలం లో ఇక్కడ నీళ్ళు అంత ఎక్కువగా వున్నట్టు కనిపించవు.కాని అక్కడక్కడ లోతులు వుంటాయి.దూర ప్రాంతాలనుంచి వచ్చినవారు ఇక్కడున్న బోర్డుల్ని కూడా ఖాతరు చేయకుండా లోపలికి వెళ్ళి మునిగి చనిపోయిన వుదంతాలు కూడా వున్నాయి.అంతదాకా ఎందుకు ప్రతి ఏడు ఒకరో ఇద్దరో దుర్మరణాలపాలవుతూనేవుంటారు.



ముఖ్యంగా నిర్లక్ష్యంగా ఆటలు ఆడుతూ నీళ్ళలో జలకాలాదుతూ క్రీడించేవారే సాధారణంగా బలవుతుంటారు.కనుక గోదావరిలో స్నానాలు చేసేటప్పుడు ఒడ్డుకి దగ్గరలో వుండి స్నానాలు చేయడమే మంచిది.వర్షాకాలంలో గోదావరి ఇంకా ఉగ్ర రూపం దాలుస్తుంది.

ఇంకొకటి చాలామంది భక్తులు ఇక్కడ పుణ్య స్నానాలు చేసే ప్రదేశం అని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి.చాలా క్షేత్రాల్లో లానే నది ఒడ్డున మల విసర్జన లాంటి కార్యక్రమాల్ని భక్తులు స్వచ్చందంగా చేయకుండా నియంత్రించుకోవాలి.సులబ్ కాంప్లెక్స్ లు దీనికి దగ్గరలోనే వున్నాయి కాబట్టి వాటిని వుపయోగించుకోవాలి.   

No comments:

Post a Comment

Thanks for your visit and comment.