Saturday, October 5, 2013

క్రీ.పూ.2500 -500 మధ్య కాలంలో వీటిని నిర్మించి ఉండవచ్చు.

మితృలు నరేంద్ర గారితో కలిసి సత్యనారాయణపురం కి దగ్గరలో నున్న కలివేరు గుట్ట మీద గల రాక్షస గూళ్ళు చూడటానికి ఇటీవల వెళ్ళాను.గతం లో కూడా వీటిని సందర్శించాను గాని ఎక్కువ చూడటం కుదరలేదు.వీటిని Megalithic age లో అప్పటి మనిషి నిర్మించిన సమాధులుగా చెప్పవచ్చును.శాస్త్రవేత్తలు చెప్పేదాన్ని బట్టి క్రీ.పూ.2500 -500 మధ్య కాలంలో వీటిని నిర్మించి ఉండవచ్చు.నాలుగు వైపులా పెద్ద రాళ్ళని నిలబెట్టి లోపల శవాన్ని ఉంచి పైన పెద్ద బండ రాయిని ఉంచేవారు.ఏ యంత్ర పరికరాలు లేని ఆ రోజుల్లో ఇంత పెద్ద బండలని ఎలా కదిలించి వీటిని నిర్మించారో ఊహించడం కష్టమే.

చాలా మటుకు విధ్వంసానికి గురయ్యాయి.కొంతమంది ఈ రాళ్ళని పగలగొట్టి ఇంటి నిర్మాణం లో కూడా ఉపయోగించుకోవడం కూడా జరుగుతోంది.బహుశా ఇవి ఏమిటో వారికి తెలిసి ఉండక పోవచ్చు.గ్ర్రీకు భాషలో మెగా అంటే చాలా పెద్దది అని,లిథోస్ అంటే రాయి అని అర్ధం.ఆ విధంగా వీటికి మెగా లిథిక్స్ అని నామకరణం చేశారు.

మనిషి ఇవి నిర్మించే సమయానికి లోహాలు కనిపెట్టలేదు లేదా వీరికి తెలియదు.కొంతమంది కలిసిన వృద్దులని కలిసి అడిగినపుడు వారి చిన్నతనం లో ఇక్కడ ఆడుకునే సమయం లో వీటిల్లో కుండ పెంకులు,పూసలు,బూడిద,చిన్న ఎముకల ముక్కలు దొరికేవని తెలిపారు.







                                                                                     Click here

No comments:

Post a Comment

Thanks for your visit and comment.