Showing posts with label Book Reviews. Show all posts
Showing posts with label Book Reviews. Show all posts

Thursday, April 30, 2015

Jottings on A Story Collection "Vennela Malupulu,Cheekati Velugulu"



I would like to introduce some Telugu stories which all have placed in a collection,titled as cited above and the writer is Malyasri.Hailed from a remote village,Mogalla Palli of Charla mandal and which falls in Bhadrachalam division.He focused issues mainly where he belonged to,plot wise and narration wise the reader discerns the temperament of its own.Malyasri entered in to other avenues like Children literature,Drama and poetry with the spirit of progressive outlook.

He understood the in things of basic Indian rural ambiance and its dynamics as he had served in rural places as a government employee, for some decades.All his encounters with ground level realities reflected in it.There are 12 stories in the collection.Right now,let's have two of them for our consideration.

First story is "Vennela Malupulu".Three principal characters namely Shouri,Shekaram and Shyamala are there.All the story being happened while they were travelling by a cart.First It would be seemed as a romantic escapade,yet which have taken another turn by its ending that reader never imagined.The narration of landscapes and its intricate details clubbed with emotional wrapping of main characters brought us back to the place of some unknown tiny village.This story was published in Andhra Prabha (Weekly) way back in 1985.

Let's get in to the second story,"Oka Seeta Kadha".This is about a working woman and her gamut of afflictions and some heartening sequences.It describes how a genuine friendly relationship was mistaken for some sordid affair by onlookers.Canvass taken for this is rural. she works in medical department and has to conduct surveys in the part of her job.A co-employee basing on the same location befriended her and kept sharing their personal blues each other which triggers an unknown relation but certainly not amorous.Eventually they parted out and the story ended up with a true meaning of togetherness sans any sacrifices or manipulations.

Let's meet next time with another two stories from the same collection of stories..!
                                           
  --Murthy Kvvs

(WRITER'S MOBILE NO: 9290070043)

Sunday, October 13, 2013

Paulo Coelho రాసిన "అలీఫ్" పుస్తకం పై నా రివ్యూ


Paulo Coelho రాసిన "అలీఫ్" పుస్తకం పై నా రివ్యూ



పావ్లో కోయిలో పేరుని నేను ఇదివరకు విని ఉన్నాను..ఆయన Alchemist  కూడా బాగాపేరుపొందినది.చాలామంది బాగుందని చదవమని చెప్పారు.కాని నాకున్న ఇతరేతర వ్యాపకాల వల్ల పడలేదు.ఈ మద్య ప్రయాణాల్లో ఓ చోట ఆయన పుస్తకం Aleph కనబడితే కొన్నాను.బ్రెజిల్ లో జన్మించిన పావ్లో మాతృభాష పోర్చుగీస్ .ఆ భాషలోనే ఆయన రచనలు చేశాడు.ఆ తరువాత అవి అనువాదం అవుతుంటాయి ఇతర భాషల్లోకి.నిజం గా ఎంత సౌకర్యం.

ఫ్రెంచ్ గాని,స్పానిష్ గాని,జర్మన్ గాని, స్వీడిష్ గాని, పోర్చుగీస్ గాని ఇంకా ఏ ప్రధాన యూరోపియన్ భాషగాని వాళ్ళ దేశాలు చిన్నవైనా వారి పెద్దలు చేసిన సాహసాల వల్ల అనేక వలస దేశాలు ఏర్పడి ఆయా భాషలకి విస్తృతి ప్రపంచవ్యాప్తంగా ఏర్పడింది. లేకపోతే ఎక్కడి దక్షిణ అమెరికా ఖండం లోని బ్రెజిల్ అక్కడికి పోర్చుగీస్ భాష వెళ్ళడమేమిటి..?

సరే... రచయిత ఈ అలీఫ్ అనే పేరుని ప్రఖ్యాత బ్రెజిల్ కధకుడు Jorge Luis Borges నుంచి తీసుకున్నట్టు తెలుస్తున్నది.
ప్రత్యేకమైన ఇతివృత్తం అంటూ ఏమీ లేదు.తనలోకి తాను ప్రయాణించడమే ఈ పుస్తకం లోని సారం.అయితే ఈ  ప్రయాణాన్ని తన రైలు ప్రయాణం తో ముడివేసి చెప్పుకో పోతుంటాడు.ఆఫ్రికా లో నుంచి..అలా యూరపు దేశాల లోకొచ్చి..ఇహ అక్కడినుంచి ట్రాన్స్ సైబీరియా మండలం చివరిదాకా ఎడతెగని రైలు ప్రయాణ అనుభవాలు మననం చేసుకుంటూ మనకి చెబుతాడు.ఇదంతా కూడా రచయిత గా తన పాఠకులని కలుస్తూ చేస్తూంటాడు.కొన్ని వేల మైళ్ళ దూరం ఆ రైలు ప్రయాణం..అరడజను పైగా ప్రామాణిక కాల మండలాలు...మధ్యలో కలిసే హిలాల్ లాంటి పాత్రలు.వాళ్ళతో అనుభవాలు..కొన్ని స్వగతాలు..!

 హిలాల్ అనే ఆవిడతో 500 ఏళ్ళ క్రితం పూర్వ జన్మలో కలిగిన పరిచయం.ప్రస్తుత ఈ జన్మలో ఈమె వయొలనిస్ట్.ఆవిడతో సంభాషణలు...అమలినశృంగారసన్నివేశాలు ..కొండొకచో వాటిని మించి కూడా..!

రచయిత కి జె అనబడే ఒక ఆధ్యాత్మక గురువు ఉన్నట్టు చెబుతాడు.అతడెవరనేదిపూర్తిగా ఎక్కడా చెప్పడు. ఒక రకంగా ఈ పుస్తకాన్ని అతని ఆటోబయోగ్రఫీ గా అనుకోవచ్చునేమో..!చాలా స్లో గా ఉంటుంది కధనమంతా.. మొత్తం మూడు భాగాలుగా విడదీశాడు దీన్నే..!

అయితే చెప్పే విధానంలో మనసుని జోల పుచ్చి నిద్రబుచ్చే టెక్నిక్ పావ్లో లో ఉంది.దాని కోసం ఆయన  వివిధ మతాలకి చెందిన కొన్ని అంశాలని బాగానే పరిశీలించివుండవచ్చు.ఎటువంటి జారత్వం లేకుండానే ఒక మనిషి ఇద్దరిని హృదయం లో కలిగిఉండటం పరిపాటి అంటాడు.ఒకరకంగా పుస్తమంతా అంతర్గత శోధనమే..!

ఈ పుస్తకాన్ని పోర్చుగీస్ లోనుంచి ఇంగ్లీష్ లోకి అనువదించిన Margaret Jull Costa  ని ఎంత అభినందించిన తక్కువే.సరళంగా,భావ యుక్తం గా చాలా బావుంది.తెలుగు లో నుంచి ఇంగ్లీష్ లోకి వచ్చే కొన్ని కధలు చదువుతుంటే ఇంత పాషాణపాకం గా ఎందుకు అనువదిస్తుంటారు..కేవలం వారి పాండితీ ప్రకర్ష చూపడానికేనా అనిపిస్తుంది.Click here

                       --Written by KVVS Murthy


Tuesday, October 1, 2013

రహస్య భారతం లో నా ఆధ్యాత్మిక అన్వేషణ పుస్తకం పై నా రివ్యూ..!


రహస్య భారతం లో నా ఆధ్యాత్మిక అన్వేషణ పుస్తకం పై నా రివ్యూ..!




పాల్ బ్రంటన్ అనేపేరు తెలుగు పాఠకులకుసుపరిచితమే!1934 లో ఆయన వెలువరించిన A Search in secret India అనే గ్రంధానికి అనువాదమే ఇది.పాల్ బ్రంటన్ అసలు పేరు Raphel Harst .చాలా వరకు రచనలన్నీ ఆయన వివిధ కలం పేర్లతోనే రాశారు.శోధించి తెలుసుకోవడం ,మానవ ప్రయత్నానికి అగ్రస్థానం ఇవ్వడం యూరోపిఎన్లకు బాగా ఇష్టమైన పనులు అని చెప్పాలి.తదేకంగా ఒకేపనిమీద కొన్ని రోజులు,అవసరమైతే కొన్ని ఏళ్ళు కూర్చోవడానికి కూడా వెనుదీయని ఈ పాశ్చాత్యుల ధీర గుణం వల్లనే మనకి అనేక దేశాలకి సంబంధించిన అనేక శాస్త్రాలు అందుబాటులోకి వచ్చినవి.

భారతీయ జీవనంలో యోగులకి గల స్థానం పరమ పూజనీయమైనది.చివరకి చిన్నపాటి ఇంద్రజాలం చేసి అలరించి ఆకట్టుకునే మాయ యోగులకి కూడా మన సమాజం ఎంతో కొంత విలువనిస్తుంది.భౌతిక శాస్త్ర ప్రమాణాలరీత్యా నిజమైన యోగిని కనుగొనడం అసాధ్యం.దీని మాటున నకిలీలు కూడా అలా చెల్లుబాటు అయిపోతుంటారు.

మరి ఇలాంటి విషయంలో పరిశోధనకు గాను ఒక బ్రిటీష్ రచయిత పాల్ బ్రంటన్ ఇక్కడికి కొన్ని దశాబ్దాల క్రితమే విచ్చేసి తన అన్వేషణ సాగించడం అద్భుత విషయమే.ఉత్తర భారతం లో ఆయన కలిసిన మెహెర్ బాబా,ఈజిప్ట్ కి చెందిన ఇంద్రజాలికుడు ఆయనలో ఒక ఆసక్తిని కలిగిస్తారు.బాహ్య ఆడంబరాలకి,పూజలకి,తంతులకి ప్రాధాన్యమిచ్చే వారిని ఆయన కలుసుకోవడానికి పెద్దగా ఇష్టపడలేదు.

అంతర్ముఖీన యోగశక్తి పనిచేయడం కాదు..అది బాహ్యప్రపంచానికి సంబంధించి ఏవైనా ప్రభావం చూపగలుగుతుందా..ఒక వేళ సాధ్యమైతే అవి ఎలాంటివి అంటూ ఒక నిర్ణీత పద్ధతిలో తన పరిశోధనని కొనసాగించారు.కేవలం తనని మొత్తం అర్పించుకోవడానికి ఆయన ఇక్కడికి రాలేదు అని మనం గ్రహించాలి.ఒక సన్నని దారం అంత ఎడం ని బ్రంటన్ పాటించారు.పాశ్చ్యాత్యులకి సహజమైన భౌతిక సాక్ష్యం ఉంటే తప్ప నమ్మననే తత్వాన్ని మూలాధారంగా చేసుకుంటూ తన పని చేసుకుపోయారు.

తమిళనాడు లోని బ్రమ అనే యోగి వద్ద హఠ యోగం మానసిక తలాలపై కూడా ఎలా పనిచేస్తుందో బ్రంటన్ అవగాహన చేసుకున్నారు.పరిణితి సాధించిన యోగి లో గల శక్తులను తులనాత్మకంగా అంచనా వేశారు.

అనువాదకులు జొన్నలగడ్డ పతంజలి అనువాద శైలి రమ్యంగా,చదువరిని ఇబ్బంది పెట్టని రీతిలో సాగింది.ఇటువంటి వస్తువు తో కూడిన గ్రంధాన్ని తెలుగు చేయడం అంత సులువు కాదు.

రాధాస్వామి అనుయాయుల భౌతిక దృక్పధం,దానితో పాటు వారి ధ్యాన పద్ధతులు బ్రంటన్ ని అలరించినవి.రామకృష్ణ పరమహంస యొక్క ప్రత్యక్ష శిష్యులు మాస్టర్ మహాశయులను ఆయన కలిశారు.రమణ మహర్షి ని అందరిలోకి ప్రత్యేకమైన యోగిగా భావించి వారి ఆశ్రమం లోనే కొన్ని రోజులు ఉన్నారు.ఆయన భోదన మౌనంగా ఉన్న సమయం లోనే ఉంటుందని ...కొన్ని విషయాలు మాట్లాడటం వల్ల అర్ధం అవ్వవని బ్రంటన్ భావిస్తారు.ఆశ్రమం లో తెలుగు వారైన రామయ్య యోగి శక్తి ని ఉగ్గడిస్తారు.

పాల్ బ్రంటన్ వ్యక్తీకరించే విధానం అది ఏ విషయమైనా గాని పూర్తిగా ఎటువైపు మొగ్గకుండా సునిశిత పరిశీలనని నింపుకొని ఉంటుంది.అది ఒక శోభని కలిగి పఠితని తనని తాను ఆలోచించుకోమంటుంది.పాశ్చ్యాత్యులు ఏ పనిని ఊరికే చేయరు.నిరంతరం ఏదో ఒకటి చేస్తూనే వుండాలి.దాని నుంచి తమ భౌతిక ప్రపంచానికి ఏమైనా ఉపయోగం ఉంటుందా అనే యోచన చేస్తారు.  

 పాల్ బ్రంటన్ ఈ గ్రంధానికి పెట్టిన పేరు A search in secret India .కాని తెలుగు అనువాదంలో "ఆధ్యాత్మిక" అనే పదాన్ని కూడా అదనంగా కొంత స్వేచ్ఛ తీసుకొని చేర్చినట్లున్నది.బ్రంటన్ యోగులను మీరు అని సంభోధించినట్లుగా,యోగులు బ్రంటన్ ని నీవు అని సంభోధినించినట్లుగా సంభాషణలు సాగుతాయి.నిజానికి పాల్ భారతీయ శిష్యుల మాదిరిగా స్వేచ్ఛని కోల్పోయే విధేయతని ప్రకటించినట్లుగా పుస్తకం లో మనకి కనబడదు.

Western tone లో నుంచి వచ్చే  కొన్ని కొన్ని మాటల్ని అర్ధం చేసుకోవడం లో మనకి కొత తర్ఫీదు అవసరం.ఒక్కోసారి వారి వ్యంగ్యాన్ని కూడా పొగడ్త గా స్వీకరిస్తుంటాము.కొన్ని pre- conceived thoughts ని లోపల పెట్టుకొని ఏ వైపు తన conclusion ని ఇచ్చినట్టు కనబడదు.తారసపడిన సంఘటనలని ఒక ఆసక్తి కరమైన డాక్యుమెంట్ లా రికార్డ్ చేశాడాయన.Click here

                                                       --By KVVS Murthy

Sunday, September 29, 2013

"సిల్క్ రూట్ లో సాహస యాత్ర" పుస్తకం పై నా రివ్యూ..!



సిల్క్ రూట్ లో సాహస యాత్ర పుస్తకం చదవడాన్ని ఈ మధ్యనే ముగించాను.ఒకానొక సమయంలో ఉత్కంఠ భరితమైన నవలల్ని ఏకబిగిన ఎలా చదివేసేవాడినో అలాగే ఇది కూడా చదివాను.మరి సస్పెన్స్ ఏముంది అనవచ్చు.అలాంటిదే ఉన్నది.పరవస్తు లోకేశ్వర్ గారి శైలి పంటికింద రాయిలా కాక పక్కనే ఒక మనిషి మాటాడుతున్నట్లుగా ఉన్నది.

పావ్లో కొయ్లో ఒకసారి అంటాడు 'ప్రయాణాలు చేయడానికి ముందు కావలసింది ధైర్యం...ఆ తరవాత ధనం' అని!ఉజ్బెకిస్థాన్,కిర్గిస్థాన్,చైనాల గురించి మనకి తెలిసింది చాలాతక్కువ.అంతకంటే ఎంతో దూరం లో ఉన్న యూరోపిఎన్ దేశాల గురించి,అమెరికా గురించి మనకి బాగా తెలుసు.మన పిల్లల,బంధుమితృల ఉద్యోగ సద్యోగాల రీత్య..చదువుల సాగింపు వల్ల..!

కాని జ్ఞానతృష్ణ చేత ఆయా దేశాల ని తిరిగి అక్కడి పరిస్థితులను ఆకళింపు చేసుకోవడానికి ఒంటరిగా ప్రయాణించడం అనేది ఒక దుస్సాహసమే..!ముఖ్యంగా మన తెలుగు వాళ్ళకి గుంపులుగా ప్రయాణించడమంటే మక్కువ ఎక్కువ.దాంట్లో రిస్క్ తక్కువ.ఆడుతూ పాడుతూ కాలక్షేపమూ జరుగుతుంది.

అంతర్జాలం సహాయం తో మనం అన్ని దేశాల వివరాలు బాగానే తెలుసుకోవచ్చు.కాని రక్త మాంసాలతో కూడిన అనుభూతులు..ఆస్వాదన...జ్ఞానార్జన స్వయంగా తిరిగినప్పుడే వస్తుంది.తాష్కెంట్,బుఖారా,సమర్ఖండ్ లలోని ప్రదేశాలలోకి..మొగలుల ఆత్మ ఉన్న చోటికి ..మనల్ని అలా నడిపించుకువెళ్ళారు పరవస్తు లోకేశ్వర్.ఎన్ని విశేషాలు..అది చదవడం లోనే కలదు మజా..!


కొన్ని ఫోటోలు కూడా ఇచ్చారు.వారి శిల్ప కళలోని వైవిధ్యం అర్ధం అవుతుంది.ఆ పురాతన కట్టడాలని చూస్తుంటే ఏ ఉత్తరాది నగరం లోనో ఉన్నట్లుగా ఉంటుంది.మరి మూలాలు మధ్య ఆసియా నుంచేగదా..!

కిర్గిస్తాన్ లో మెడిసిన్ చదువుతున్న తెలుగు ఇంకా ఇతర రాష్ట్రాల పిల్లల యొక్క గాధలు కొత్తకిటికీలు తెరుస్తాయి.ప్రిస్టేజ్ కోసమో,ధన సంపాదన కోసమో మెడిసిన్ చదివే సంస్కృతి మనకి దాపురించడంవల్ల నిజం గా వైద్య శాస్త్రం పై ఆసక్తి గల విధ్యార్దులకి మెడిసిన్ సీటు అందని మానిపండే అయింది.మళ్ళీ ఆయా విషయాల్లో రిసర్చ్ ఏమైనా జరుగుతుందా అంటే ఏమీఉండదు..దానికి విదేశాలపై ఆధార పడాలిసిందే..!

కిర్గిస్థాన్ లో ప్రజలు రౌడీల కంటే ఎవరికి,ఎందుకు భయపడతారో రాసిన విధానం బాగున్నది.చిన్న చిన్న దేశాల్లో సైతం మల మూత్రాదులు విసర్జించడంలో తీసుకునే శుబ్రతా చర్యలు ఎంతో సాంస్కృతిక ఔన్నత్యం గల మన దేశం లో తీసుకోకపోవడం బాధగా అనిపిస్తుంది.రచయితకి ఆయా దేశాల్లో పరిచయమయ్యే మితృలు ..వారు చేసే సాయాలు చూసినప్పుడు ప్రతి చోట తోటి మనిషిని అర్ధం చేసుకునేవారుంటారనిపిస్తుంది.చైనా లో భాషా సమస్య..ఆహార విహారాలు...దైనందిన అనుభవాలు కధ వెనుక కధలు ఆసక్తిగా వున్నాయి.    

అలనాడు హుయాంత్సాంగ్..ఫాహియాన్..మార్కోపోలో లాంటి యాత్రికులు ఇంకా ఎలాంటి దుర్భర పరిస్థితులని ఎదుర్కొని ప్రయాణాలు చేశారో కదా అనిపించక మానదు.తిరగడం లోనే మానవ స్వభావం లోని లోతుపాతులు తెలుస్తాయి.తిరగడం అనేది ఒక పోరాట స్వభావం లాంటిది.ప్రతి జాతి లోను కొన్ని బలాలు,బలహీనతలు ,వైరుధ్యాలు ఉంటాయి.అవి అర్ధం చేసుకున్నప్పుడు ఎవరిని ఏ విధంగా ఆకట్టుకోవాలో..వారించాలో చక్కగా అవగతమౌతుంది.అందుకేనేమో యూరోపిఎన్ లు పిచ్చిగా తిరుగుతుంటారు ప్రపంచమంతా...!

                                                                   -- By KVVS Murthy

 For copies,contact: Paravastu Lokeswar (Writer), Mobile no: 9160680847