Sunday, June 30, 2013

భద్రాచల క్షేత్ర విశిష్టత-2



ఆంధ్రప్రదేశ్ లోని ప్రతి మూలనుంచి భద్రాచలానికి బస్సు సౌకర్యం వున్నది.అటు అనంతపురం నుంచి,అదిలాబాద్ నుంచి,ఇంకా శ్రీకాకుళం నుంచి,చిత్తూరు నుంచి ఇలా ప్రతి జిల్లానుంచి భద్రాచలానికి బస్సు సౌకర్యం వున్నది.మద్రాస్ కి ఇంకా జైపూర్..రాయగడ ,జగదల్ పూర్ ఇలా ఇతర రాష్ట్రాలకి సైతం బస్సు సౌకర్యం నేరుగా వున్నది.ఒరిస్సా,చత్తీస్ గఢ్ రాష్ట్రాల సరిహద్దులు చాలా దగ్గర కూడా..!

దాని వల్ల ఏ జిల్లా నుంచైనా భద్రాచలానికి రావడం చాలా సులువు.ఐయ్తే రైలు ప్రయాణం చేసేవారు ఒకటి గుర్తుంచుకోవాలి.భద్రాచలానికి దగ్గరి రైల్వెయ్ స్టేషన్ కొత్తగూడెం అని గుర్తుంచుకోవాలి.ఇది ఇంచుమించు నలభై కి.మీ. దూరంలో వుంటుంది.దీన్ని భద్రాచలం రోడ్ అని వ్యవహరిస్తారు.ఇబ్బంది ఏమీ వుండదు..కొత్తగూడెం నుంచి ప్రతి 5 లేదా 10 నిమిషాలకి ఒక బస్సు వుంటుంది.

No comments:

Post a Comment

Thanks for your visit and comment.