Wednesday, July 17, 2013

ఇదివరకు వుచిత ప్రవేశమే గాని ప్రస్తుతం అయిదు రూపాయలు ప్రవేశ రుసుముగా చేశారు


భద్రాచలం లోకి అడుగుపెడుతుండగానే ముందుగా కుడివైపున అభయాంజనేయ స్వామి పార్క్ కనిపిస్తుంది.ఆ పార్కు కి కొంచెం ముందుకి వెళితే వచ్చే ఆంజనేయ స్వామి గుడి పేరుమీదుగానే ఈ పార్క్ ఏర్పడింది.చిన్న పిల్లలకి,పెద్దవాళ్ళకి సాయంత్రం అవగానే కాస్త ఓదార్పు లాగా వుంటుంది.ఇప్పుడు పచ్చదనం తో బాగానే అలరిస్తున్నది.కొంతమంది ప్రయాణీకులు ..గుడి కి వచ్చినవాళ్ళు ఇక్కడ అప్పుడప్పుడు సేద తీరుతుంటారు.

ఇదివరకు వుచిత ప్రవేశమే గాని ప్రస్తుతం అయిదు రూపాయలు ప్రవేశ రుసుముగా చేశారు.అయినా జనాలు బాగానే వస్తుంటారు.సెలవురోజుల్లోనైతే ఇంకొంచెం ఎక్కువేనని చెప్పాలి.ఇది ITC,Bhadrachalam Paper boards వారి సహకారం తో ముందు ఏర్పాటు అయ్యింది.

ఆసియా ఖండం లోని రెండవ పెద్ద పేపర్ మిల్లుగా చెప్పబడే ఇది ఈ పార్క్ కి ముందు గల బ్రిడ్జ్ దాటిన తరవాత సారపాక అనే ప్రదేశం లో వున్నది.ఈ పార్క్ కి ఎడమవైపున కరకట్ట వుంటుంది.దాని మీద రామాయణం లోని కొన్ని ఘట్టాలని బొమ్మల రూపంలో తీర్చిదిద్దారు. బాపు,రమణల సృజన ఇది.దాని గురించి ఇంకోసారి చెప్పుకుందాము. 

No comments:

Post a Comment

Thanks for your visit and comment.